తెలంగాణలో రైతులకు రుణమాఫీ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించినట్టుగా తెలుస్తున్నది. అందుతున్న సమాచారం మేరకు రూపాయలు 1,50,000 రుణాలు ఉన్న వారికి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంచరంగ ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు పూర్తి సమాచారం అందాల్సి ఉన్నది. రాష్ట్రంలోని రైతులకు రూపాయలు రెండు లక్షల వరకు మాఫీ చేస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ మేరకు రెండో విడతగా 1,50,000 రుణాన్ని మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. కొద్దిరోజుల క్రితమే రూపాయలు లక్ష వరకు రుణం ఉన్నవారికి బ్యాంకులో డబ్బులు జమచేసి మాఫీ చేసిన సంగతి తెలిసినదే.
