జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలలో మళ్ళీ కలకలం మొదలైంది. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. ఆ విద్యార్థిని కావున కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సదరు విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్ గా గుర్తింపు. మరో విద్యార్థి మోక్షిత్ కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
