(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు సోమవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డీజీపీకి పూల బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కొద్దిసేపు పరస్పర అంశాలపై ఆత్మీయంగా చర్చించినట్లు సమాచారం.
ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా పలువురు నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
