తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రంగారెడ్డి నాగర్ కర్నూల్ మహబూబ్నగర్ నల్గొండ సూర్యాపేట జగిత్యాల కరీంనగర్ అదిలాబాద్ అసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల్ వికారాబాద్ కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
