నిన్నటి తరువాయి)
గాంధీజీ అనుచరులైన వారు, అటువంటి మరణముల ద్వారా, చనిపోయిన గాంధీజీ ఆత్మను సంతోషపరచుచున్నట్లు ఒక నమ్మకము కల్గియున్నట్లు వుండినది. లేకపోతే జైలు నియమములలో లేకపోయినప్పటికిన్నీ రక్తదానము కోరడం, అందుకు శిక్షలలో మినహాయింపులు మంజూరు చేయడం, తర్వాత నెత్తురును కాజీయడమే గాక గాంధీ హత్యకేసులోని శక్షితులకు మంటూరు చేయబడిన మినహాయింపులను గూడ మింగివేయటం వంటి చౌకవారు తమాషాలకు కారణులు ఏమీ కనబడవు.
దైహికంగా తనకన్న బలవంతులైన ఈ మోసగాళ్లచే మోసగించబడినానని ఎప్పుడైతే గోపాల్కృష్ణ గోడ్సే తెలుసుకున్నాడో అప్పటి నుండి రక్తదానమైతే చేస్తూ వుండవినాడే గాని వారి ఉదారమైనన మినహాయింపులను స్వీకరించలేదు. ఆయన జాతి పిలుపును గౌరవిచినాడే గాని తమలో ధర్మశీలము ఏ మాత్రము లేకుండా ఇతరులకు ధర్మపన్నాలు బోధించే పెద్ద మనుష్యులను కాదు అటువంటి పెద్ద మనుష్యులెవరైనా గాంధీజీకి శ్రద్దాంజలి ఘటించుటకనే మిషతో రాజఘాట్కు పోయి సత్యం అహింసలకు బద్దులమై యుంటామని ప్రయాణము చేసినారని తెలిసినప్పుడు మన దేశంలో ప్రజలను మూర్ఖులుగా జమకటుట్టకు ఎంతైనా అంతులేని అవకాశముందని గోపాల్కృష్ణ గోడ్సే భావించేవాడు.
గోపాల్కృష్ణ గోడ్సే తన విడుదల విషయంలో ఇరవైరెండు సార్లు సుప్రీంకోర్టులో వ్యాజ్యము చేసినాడు. ప్రభుత్వంలో అవినీతి, దురుద్ధేశ్యము వున్నట్లు రుజువు చేయలేకపోయినాడు. ప్రభుత్వము నేరస్థులపై తమకు పూర్తి అధికారము వున్నదని, వారు మరణించువరకు కక్షతో బంధించి వుంచదలచినామని చెప్పుకుంది.
ఆయన పిటిషన్లలో ఒకటి విచారణలో వుండి ప్రభుత్వమునకు నోటీసు ఇవ్వబడినది. ఈ సమయంలోనే 1964 ఆక్టోబరు 13వ తీదీన ఆయన నీ కేసులోని మితగా ఇద్దరు విడుదల చేయబడినారు. అప్పటికి శిక్షలో ఇవ్వబడిన మినహాయింపులో సహా 26 సంవత్సరములు పూర్తి చేసినారు. అంతకుముందు కొన్ని నెలలకు పూర్వమే పండితÊ జవహర్లాల్ నెహ్రు చనిపోయినాడు.
గోపాల్కృష్ణ గోడ్సే సుప్రీం కోర్టునుండి తనకు అనుకూలమై వుత్తర్వులు పొందలేకపోయినప్పటికి సుప్రీం కోఉ్ట అనేది లేకపోయివుంటే ప్రభుత్వము ఆయనను విడుదల చేఉ ఆలోపచనే చేసి వువడేది కాదనేది సత్యమైన విషయము.
(తరువాయి బాగం రేపు)
విడుదల తరువాత జీవితాలు
