.నిన్నటి తరువాయి)
యావజ్జీవ శిక్ష పొందిన ముగ్గురి యెడ ప్రభుత్వము, ముఖ్యంగా వారి విడుదల విషయంలో ఆసాధారణమైన కాఠిన్యముతోను, క్రూరముగను ప్రవర్తించింది. ప్రభుత్వము యావజ్జీవ ‘‘ద్వీపాంతరవాసము’’ క్రింద ఆశ్రయము తీసుకొనినది. అది వారిని స్వతంత్ర జీవనము గడుపుటకు ఏ ద్వీపాంతరము పంపలేదు. శిక్షితుల కోరకపైగాక తన అనుకూలతను బట్టి ఆ విధంగా చేసింది. అంతేకాదు అది వారిని ఆ మరణాంతము కారాగారములో బిట్టి వారి జీవితములపై తన దుష్టదృష్టి సారించింది.
కఠినశిక్ష అనుభవించే వారికి వారు చేయుపని, వారి నడవడిని బట్టి శిక్షలో మినహాయింపులు ఇస్తారు. యావజ్జీవ శిక్ష ననుభవించే ఖైదీ కఠిన శిక్ష అనభవించేవాడి కింద భావిస్తారు. శక్షలో మినహాయింపులు ఆ మేరకు శిక్షా కాలము తగించుటకుగా ఉద్ధేశింపబడినవి.
గోపాల్గోడ్సే తన నుండి ఆశించిన విధులనెల్ల నిర్వహించడమే గాక తన యావజ్జీవ శిక్షా కాలములో కోరినప్పడెల్ల రక్తదానము చేసినాడు. ఈ విధముగా చేసిన దానికి ప్రతి తడవకు ప్రభుత్వము పదిరోజులు శిక్షలో మినహాయింపు ఇస్తుంది, ఆయనకీ ఈ వ ఇషయంలో ఈ మినహాయింపులు రికార్డు చేయబడనవి కాని ఎప్పుడు అము పరచబడలేదు, ఇది ప్రభుత్వ మంత్రాలయము, రిజర్వు బ్యాంకఅయు ఇచ్చి చట్టసమ్మతమైన డిమాండు డ్రాప్టును గౌరవించని విధంగా వున్నది, ప్రభుత్వము మినహీవఆయింపులను ఆయన లెక్కలో జమకటుట్టకు రచబుత మరణ దినమును తెలియగోరినది. అనగా ఆయన మరణించునంత వరకు ఈ మినహాయింపులను అము చేయదలచలేదు.
ఆయన విడుదల విషమై ఆలోచించుటకు అంతులేకుండా గడువులు వేయసాగింది ప్రభుత్వం.
ప్రభుత్వంలో పెత్తనం చేసే పెద్ద మనుష్యులు ఇటువంటి మోసపూరితమైన తమషాల ద్వారా ఆఖండ హిందూస్థాన్కై తమ జీవితములనే ఫణముగా పెట్టిన ఖైదీలు అహింసా మార్గంలో మరణించునట్లు చేసి తాము అహింసా వాదానికి సేవచేస్తూ వున్నట్లు గాఢంగా నమ్ముతున్నట్లు ప్రవర్తించినారు.
(తరువాయి బాగం రేపు)
