తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను నియమిస్తున్నట్టుగా రాష్ట్రపతి భవన్ నుండి శనివారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. త్రిపుర రాష్ట్రానికి చెందిన వర్మ 1957 ఆగస్టు 15న జన్మించారు. 1990లో బిజెపిలో చేరారు. అయోధ్య ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేశారు. త్రిపుర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణు దేవ శర్మను నియమించడం పట్ల ఆయా వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతుంది
