(బాలే అజయ్ కోరుట్ల)
కోరుట్ల పోలీసులు బుధవారం ఐలాపూర్ గ్రామ శివారులో దాడులు నిర్వహించి అక్రమంగా పేకాట ఆడుచున్న 6 గురు వ్యక్తులను పట్టుకున్నారు.
వారి వద్ద నుండి పేకాట నిర్వహణకు ఉపయోగించిన నగదు రూ.12,280/-, 6 మొబైల్ ఫోన్లు మరియు 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అయినా దూరంగా ఉండాలని, సూచించారు. పేకాట వంటి జూద కార్యకలాపాలలో పాల్గొనరాదని, అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.
