తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే కార్యక్రమంపై జగిత్యాల జిల్లా పోలీసులు జిల్లా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. ఇంటింటా కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు చిల్లర దొంగలు ఆధార్ కార్డులు బ్యాంకు పాస్ బుక్ అడిగే అవకాశాలు ఉన్నాయని ఫోన్ నెంబర్ ఓటీపీలు అనధికార వ్యక్తులకు చెప్పవద్దని జగిత్యాల జిల్లా పోలీసులు ప్రజలకు ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. అనుమానంగా ఉన్నవారు ఎవరైనా సర్వే పేరున ఇంటికి వస్తే 100 కు ఫిర్యాదు చేస్తే పోలీసులు తగు చర్యలు తీసుకుంటారని వారు తెలిపారు. ఈ విషయం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
