(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని ఆర్బీఐ సీఎఫ్ఎల్ (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ పండుగను దేశభక్తి వాతావరణంలో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగేంద్రప్రసాద్, కొండ నవీన్, మేఘమాలతో పాటు ఇతర నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
