
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జనసేన పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నియోజకవర్గ ఇన్చార్జ్ వోడ్నాల రామారావు నేతృత్వంలో దేశభక్తి వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా వీర మహిళ వోడ్నాల సౌజన్యతో పాటు వీర మహిళల చేత త్రివర్ణ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు, మిఠాయిలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అడక్ కమిటీ సభ్యుడు చిలువేరి సాయి కృష్ణతో పాటు మామిడాల రామేశ్వరి, మహాదేవ్, కట్టా రంజిత్, అనిల్, సంపత్, సురేష్, కరుణాకర్, ప్రశాంత్, మణిదీప్, రమేష్, పులి అనిల్, రాజు, శశి, విజయ్, అభినవ్ మరియు జనసైనికులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
