కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో కొద్ది రోజుల క్రితం సంభవించిన ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం సుమారు 400 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంకా సుమారు 200 మందికి పైగా ఆచూకీ తెలియటం లేదన్నది సమాచారం. ఆచూకీ లభ్యం కానీ అందరూ కొండ చర్యల్లోని శిథిలాల కిందే ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇండియన్ ఆర్మీ ఎన్ డి ఆర్ ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ లతోపాటు ప్రైవేటు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ లాంటి స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
