బారాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఇక అటకెక్కినట్టేనని సమాచారం అందుతుంది. 2024 25 సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గొర్రెల పంపకానికి సంబంధించిన నిధులను ఏమీ కేటాయించలేదు. దీంతో గత ఆరు సంవత్సరాలుగా అమలవుతున్న ఈ పథకం ఇక కనుమరుగైనట్లేనన్న సమాచారం వస్తుంది. ఈ పథకంలో అవినీతి ఆరోపణలు పుష్కలంగా వచ్చిన నేపథ్యంలో ఈ పథకాన్ని మూసేస్తున్నట్టుగా సమాచారం. ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడంతో ఆయా వర్గాల్లో కొంత ఆందోళన సందిగ్ధత ఏర్పడింది. అయితే ఈ పథకం స్థానంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.
