ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్క్ భూటాపతే ప్రాంతంలో సైనికుల వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడినట్లు సమాచారం. కాశ్మీర్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉగ్రమూకలు దాడులకు తెగబడడం వరుసగా జరుగుతోందన్న సమాచారం వస్తుంది. అయితే ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
