
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల పట్టణంలోని గడిబురుజుల వద్ద గల శ్రీ గడి మైసమ్మ తల్లికి భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాట పిల్లలతో అమ్మవారికి శాంతి నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల ప్రతినిధులు, మహిళలు, వార్డు సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ జిల్లా కన్వీనర్ మాడవేణి నరేష్ మాట్లాడుతూ, సమాజంలో ఐక్యత, సామరస్యం పెంపొందించే సాంప్రదాయ ఉత్సవాలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్వప్న, పూర్ణిమ చౌదరి, కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యదర్శి సుదవేని మహేష్, వివిధ కుల సంఘాల సభ్యులు, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
