తెలంగాణ సామ్నా: సంథ్య థియేటర్లో పుష్ప2 సినిమా ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెంది ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్రెడ్డి అన్నట్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో సంఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చినప్పటి నుండి వెళ్లిపోయిన వరకు జరిగిన సంఘటనల్ని ప్రచారం అవుతున్నాయి. దీనితో నిన్నటి వరకు అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకు సంఘటన రోజు ప్రవర్తించిన తీరుకు తేడాగా వుందని చాలామంది నెటిజన్లు అంటున్నారు. అలాగే రేవంత్రెడ్డికి ఈ విషయంలో మద్ధతు పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తున్నది.

